సింగరేణి కోల్ మైన్స్లో రూ.50 వేల కోట్ల స్కాం జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. సింగరేణిపై ప్రధానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. సింగరేణి టెండర్లలో చోటుచేసుకున్న అవకతవకలపై కోర్టుకు వెళ్లానని రేవంత్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్కు చెందిన వారికే కాంట్రాక్టులు దక్కాయన్నారు. రూ.50వేల కోట్ల కాంట్రాక్టును ఒకే సంస్థకు అప్పగించారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ప్రక్రియ జరుగుతున్నా సీఎండీ శ్రీధర్పై డీఓపీటీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. సింగరేణి స్కాంపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రతిమా శ్రీనివాస్ కంపెనీకి నిబంధనలు ఉల్లంఘించి గనులు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణి అంశంపై ప్రధాని సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు తమ ఫిర్యాదు బదిలీ చేయాలని ఆయన కోరారు.