పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్జీ-3 బొగ్గు గని పై కప్పు కూలింది. ఈ ప్రమాదంలో బొగ్గు రాళ్ల కింద చిక్కుకున్న ఐదుగురు మృతిచెందారు. వీరిలో అసిస్టెంట్ మేనేజర్, నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సింగరేణి ఆండ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో ఘటన చోటుచేసుకుంది. గాయపడిన కార్మికులను చికిత్స కోసం రామగుండం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి రెస్క్యూ టీం, పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెస్క్యూ టీం గనిలోకి దిగి సహాయచర్యలు చేపట్టింది. ఈ ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.