Friday, April 19, 2024
Friday, April 19, 2024

సింగూరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

సింగూరు ప్రాజెక్టుకు మళ్లీ వరద పోటెత్తుతోంది. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టినా మహారాష్ట్ర నుంచి వరద నీరు వస్తుండటంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 29,677 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిలువ 29.618 టీఎంసీలు ఉంది. సింగూరు ప్రాజెక్టు దిగువన మంజీర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img