అగ్నిపథ్కు వ్యతిరేకంగా నిరసిస్తూ యువకుల ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతపై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పందించారు. రైల్వే స్టేషన్లో విధ్వంసానికి ఎన్ఎస్యూఐ సంఘాలు కారణమని వస్తున్న ఆరోపణలను ఖండిరచారు. తమకు ఈ అల్లర్లు, విధ్వంసంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ఓ వీడియో విడుదల చేశారు. అగ్నిపథ్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష రద్దు కావడంతో కొన్ని గంటల వ్యవధిలో 44 మంది ఆత్మహత్య చేసుకున్నారని, దీంతో ఆవేశానికి లోనైన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనతో ఎన్ఎస్యుఐకి ఎటువంటి సంబంధం లేదు. అభ్యర్థుల నిరసనలో మాకు ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అగ్నిపథ్ కొత్త విధానం వల్లే అభ్యర్థులు ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. తాను ఉదయం ఓ ఈవెంట్కు వెళ్తుంటే తనను మధ్యలోనే అడ్డుకుని షహనాజ్ గంజ్ పీఎస్కు తరలించారని చెప్పారు. అందుకే తాను పోలీస్స్టేషన్లో ఉండి కూడా ఈ వీడియో ద్వారా స్పష్టంచేస్తున్నానని వెల్లడిరచారు. ఎవరూ ఇలాంటి దాడులకు పాల్పడవద్దని, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదని ఆందోళనకారులకు, అభ్యర్థులకు సూచించారు.