‘అగ్నిపథ్’ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకారులు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారుల నిరసనను నిలువరించేందుకు పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టినా ఫలితం లేకపోయింది. ఫలితంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. అప్పటికీ ఆందోళనకారులు అల్లర్లు ఆపలేదు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఒకరు మృతిచెందగా మరికొందరికి గాయాలయ్యాయి. మృతిచెందిన వ్యక్తిని వరంగల్ జిల్లాకు చెందిన దామోదర్ రాకేశ్గా గుర్తించారు.