జిల్లా నూతన కలెక్టర్గా ఎం హనుమంతరావు
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలను మరింత అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తానని జిల్లా నూతన కలెక్టర్ ఎం హనుమంతరావు అన్నారు. సిద్దిపేట జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని పేర్కొన్నారు. జిల్లాలోని పెండిరగ్ ప్రాజెక్టులపై త్వరగా సమీక్ష నిర్వహించి వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి స్టేటస్ తెలుసుకొని క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించి ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్గా ఎం హనుమంతరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి కలెక్టర్ ఎం హనుమంతరావుకు సిద్దిపేట కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే. వెంకట్రామ్రెడ్డి రాజీనామాతో సిద్దిపేట కలెక్టర్ పోస్టు ఖాళీ అయ్యింది. ఆయన స్థానంలో హనుమంతరావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.