యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2022 తుది పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 933 మందిని ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇషితా కిశోర్ తొలి ర్యాంకు సాధించగా, తెలంగాణకు చెందిన ఉమా హారతి ఎన్ మూడో ర్యాంకు సాధించారు. మూడో ర్యాంకు సాధించిన నూకల ఉమా హారతి.. నారాయణపేట ఎస్సీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె. ఉమా హారతి స్వస్థలం సూర్యాపేట జిల్లాలోని హుజుర్నగర్.సివిల్స్ తుది ఫలితాల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు ఎంపికయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన శాఖమూరి శ్రీసాయి హర్షిత్ 40వ ర్యాంకు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు శివ మారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించారు.బీవీఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకు, హెచ్ఎస్ భావనకు 55, సాయి ప్రణవ్కు 60, నిధి పాయ్ 110, అంకుర్ కుమార్ 257, చల్లా కళ్యాణి 285, వై శృతి 362, శ్రీకృష్ణ 293, హర్షిత 315, లక్ష్మి సుజిత 311, సోనియా కటారియా 376, రేవయ్య 410, సీహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి 426, రెడ్డి భార్గవ్ 772, నాగుల కృపాకర్ 866వ ర్యాంకు సాధించారు.మెయిన్స్లో అర్హత సాధించిన వారిని పర్సనాలిటీ టెస్టు కోసం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఇంటర్వ్యూ చేసింది. ఫైనల్గా 933 మందిని వేర్వేరు సర్వీసులకు ఎంపిక చేసింది. మొత్తం 345 మంది జనరల్ కోటాలో ర్యాంకులు సాధించారు. ఇక 99 మంది జుఔూ కోటాలో, 263 మంది ూదీజ కోటాలో, 154 మంది ూజ కోటాలో, 72 మంది ూు కోటాలో 2022 సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు.