2021 సివిల్స్లో ర్యాంకులు సాధించిన వారిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇవాళ తన ట్విట్టర్లో ఆయన స్పందిస్తూ.. సివిల్స్ ఫలితాలతో సంక్పలం, పట్టుదలకు చెందిన కొన్ని అద్భుతమైన కథలు వెలుగులోకి వచ్చినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. సివిల్స్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన టాప్ ముగ్గురు అమ్మాయిలకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ చెప్పారు. . మీ ప్రతిభ, ప్రయత్నాలతో ఈ దేశాన్ని మీరు ముందు ఉండి నడుపుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సివిల్స్ 2021లో టాప్ మూడు స్థానాలను అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. భూపాలపల్లికి చెందిన యువకుడు నరేశ్కు 117వ ర్యాంక్, నిజామాబాద్ యువతి స్నేహకు 136వ ర్యాంకు, సూర్యాపేటకు చెందిన చైతన్యరెడ్డికి 161వ ర్యాంకులు వచ్చాయి.