సీఎంకు స్వల్ప అస్వస్థత..యశోద ఆస్పత్రిలో చికిత్స
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించినట్లు సీఎంవో వెల్లడిరచింది. పరీక్షల అనంతరం సీఎం వైద్య పరీక్షలపై ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు వివరణ ఇచ్చారు. ‘సీఎం కేసీఆర్కు ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్గా చెకప్ చేస్తుంటాం. రెండు రోజులుగా నీరసంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి నాతో చెప్పారు. నార్మల్ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం. సీఎంకు సిటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేశాం. అంతా నార్మల్గానే ఉంది. ఎలాంటి బ్లాక్స్ లేవు. రొటీన్ పరీక్షల్లో భాగంగానే అన్నీ చేస్తున్నాం. రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఇది కేవలం ప్రివెంటివ్ చెకప్ మాత్రమే. ఎవరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు’ అని ఎంవీ రావు ప్రకటనలో తెలిపారు. కాగా.. కేసీఆర్ వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, కుటుంబ సభ్యులు ఉన్నారు. మరోవైపు కేబినెట్ మంత్రులు, ముఖ్యనేతలు ఇప్పుడిప్పుడే ఆస్పత్రికి చేరుకుంటున్నారు.