నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత సీఎం కేసీఆర్కు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె నిజామాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి సీ నారాయణరెడ్డి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరోసారి ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.