హుజురాబాద్లో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ఎవరేమి కామెంట్స్ చేసినా.. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి అని స్పష్టం చేశారు. హుజురాబాద్లో బీజేపీ గెలుపు ఊహించినదే అని చెప్పారు. సీఎం కేసీఆర్పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని అన్నారు. . హామీలు అమలు చేయటంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. ఓటర్లను టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఈటల రాజేందర్ మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని తెలిపారు. డబ్బును కాదని చైతన్యాన్ని చాటిన హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.