సీఎం కేసీఆర్ వరి పండిస్తే తప్పేంటి, ఆయన పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తే ప్రశ్నించాలి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ధాన్యం కొనుగోలుపై ఢల్లీిలో టీఆర్ఎస్ ఎంపీలు పోరాడినప్పుడు కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర ఎంపీలు ఎక్కడ ఉన్నారని విమర్శించారు.‘బాధ్యతాయుత పదవిలో ఉంటూ రేవంత్రెడ్డి అసభ్య పదజాలం వాడుతున్నారని అన్నారు. తెలంగాణకు నిధులివ్వని కేంద్రం అవార్డులు మాత్రం ప్రకటిస్తోందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని కొందరంటున్నారు. వారిని ఎవరైనా నామినేట్ చేశారా? ప్రజలు ఎన్నుకుంటే గెలిచారని అన్నారు.