ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు అయ్యింది. అస్వస్థత కారణంగా కేసీఆర్ పర్యటన రద్దు అయ్యినట్లు అధికారులు ప్రకటించారు. సీఎం పర్యటన రద్దు అయిన నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణానికి ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.