తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కోసం ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం నూతన కలెక్టరేట్ భవనాన్ని, బహిరంగ సభ జరిగే మైదానాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈనెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని, తెరాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం లక్ష మందితో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు.