గత కొంతకాలంలో పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇద్దరు నేతలు పరస్పరం పలకరించుకున్నారు. ఈ సన్నివేశం కాంగ్రెస్ శాసనసభ పక్ష కార్యాలయంలో చోటుచేసుకుంది. సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రత్యేకంగా సమావేశమైన ఇద్దరు నేతలు.. దాదాపు 20 నిమిషాలకు పైగా ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు, ఇద్దరు మధ్య సయోధ్య కుదిరినట్లు పార్టీ వర్గాలు వెల్లడిరచాయి.ఇదిలావుంటే,జగ్గారెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు పీసీసీ చీఫ్పై బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. అయినప్పటికీ భేదాభిప్రాయాలే తప్ప విభేదాలు కావుని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కుటుంబంలో కలహాలు ఉన్నట్టే పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయని పేర్కొన్నారు.తాజాగా ఇద్దరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎల్సీ కార్యాలయంలో సమావేశమైన రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి పార్టీ బలోపేతంపై చర్చించినట్లు సమాచారం. త్వరలోనే ఎన్నికల వస్తాయన్న వార్తల నేపథ్యంలో ఇద్దరు నేతల భేటీ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహన్ని తీసుకువచ్చింది.