Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సీనియర్‌ సిటిజన్స్‌కు రైళ్ల ఛార్జీల్లో రాయితీపై నిర్ణయం తీసుకోవాలి


: మంత్రి కేటీఆర్‌
సీనియర్‌ సిటిజన్స్‌కు రైళ్ల ఛార్జీల్లో రాయితీ కల్పించే అంశంపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ లో పేర్కొన్నారు.. సీనియర్‌ సిటిజన్‌ ప్రయాణికుల ఛార్జీలకు వర్తింపజేసే రాయితీలను మార్చి, 2020 నుంచి రద్దు చేశారు. ఈ క్రమంలో సీనియర్‌ సిటిజన్స్‌ అందరూ పూర్తి ఛార్జీలు చెల్లించి రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 4 కోట్ల మంది సీనియర్‌ సిటిజన్స్‌ పూర్తి ఛార్జీలు చెల్లించి ప్రయాణించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది.దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు.ఓ వార్తా సంస్థ చేసిన ట్వీట్‌ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్యాగ్‌ చేశారు. రైల్వే మంత్రి గారూ.. ఇది చాలా దురదృష్టకరమని కేటీఆర్‌ పేర్కొన్నారు.సీనియర్‌ సిటిజన్స్‌కు మన సహాయ, సహకారాలు అవసరం. వారిని గౌరవించుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img