సెప్టెంబర్ 17వతేదీన జాతీయ సమైక్యత దినం నిర్వహించాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ విమోచనం కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు అన్నారు. అమిత్ షా కు, సీఎం కేసీఆర్ కు లేఖలు రాశానన్నారు. 17న పాతబస్తీలో తిరంగా యాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు.