సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచారం ఘటన తర్వాత పోలీసులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు. సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి చైత్రపై నిందితుడు రాజు అత్యచారం, ఆపై హత్య చేసిన విషయం తెలిసిందే. చిన్నారి మృతదేహం తరలింపు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని తరలించే సమయంలో స్థానికులు పోలీసులను అడ్డుకున్నారు. ఆరోజు విధుల్లో ఉన్న పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వారు. పలువురు మహిళా పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఆ ఘటనలో దాదాపు 12 మంది పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే, ఇప్పుడు ఆ ఘటనపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వీడియో ఫుటేజీ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. . మరోవైపు సింగరేణి కాలనీలో గంజాయి, గుడుంబా విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని కూడా పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అక్రమ మద్యం, గంజాయి, గుడుంబాలను అరికట్టడమే ధ్యేయంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు