హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో కలకలం రేపిన బాలికపై అత్యాచారం, హత్యకేసులో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లాలో నిందితుడిని అరెస్టుచేశారు. రాజు స్వగ్రామం అడ్డగూడురులో అతడిని అదుపులోకి తీసుకుని, హైదరాబాద్కు తరలించినట్లు ఎస్ఐ ఉదయ్కుమార్ వెల్లడిరచారు. నగరంలోని సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక.. పక్కనే ఉన్న రాజు ఇంట్లో అనుమానాస్పద రీతిలో గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. బాలికను తీసుకెళ్లిన రాజు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్యచేసి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. తూర్పు మండలం డీసీపీ రమేష్ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు నిన్న నిరసన తెలిపారు. చంపాపేట నుంచి సాగర్ వెళ్లే మార్గంలో దాదాపు ఏడు గంటలపాటు బైఠాయించారు. నిందితుడిపై కఠినచర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని కలెక్టర్ హామీఇవ్వడంతో ఆందోళనను విరమించారు.. ప్రభుత్వం తరపున బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని, రెండు పడక గదుల ఇల్లు, ఉద్యోగం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద రూ.50 వేలు అందజేశారు. అత్యాచారం చేసి గొంతు నులిమి చిన్నారిని హత్య చేసినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.