Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సైబరాబాద్‌ పరిధిలో ఏడాదిన్నరలో 5,456 రోడ్డు ప్రమాదాలు


యాక్సిడెంట్స్‌పై ప్రత్యేకంగా మానిటరింగ్‌ చేస్తున్న విభాగం ఒక్క సైబరాబాద్‌ పరిధిలోనే ఏడాదిన్నరలో 5,456 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు గుర్తించింది. ఈ ప్రమాదాల కారణంగా 1136 మంది దుర్మరణం చెందారు. 5298 మంది గాయాలపాలయ్యారు. వారిలో కొంతమంది కోలుకోగా వందల మంది ఏదో ఒక రకం అంగవైకల్యంతో బతుకు వెళ్లదీస్తున్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికి సైబరాబాద్‌ పోలీసులు రోడ్డు ట్రాఫిక్‌ యాక్సిడెంట్స్‌ మానిటరింగ్‌ సెల్‌ (ఆర్టీఏఎమ్‌ సెల్‌) ఏర్పాటు చేశారు. డీసీపీ విజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ గురువయ్య ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిగణలోకి తీసుకున్న ఆర్టీఏఎమ్‌ సెల్‌ విభాగం ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను అధ్యయనం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img