కొత్త సీపీగా స్టీఫెన్ రవీంద్ర
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. ఆయన్ను టీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జనార్ మూడేళ్లపాటు సైబరాబాద్ సీపీగా పని చేశారు. ఇక సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఐజీ స్టీఫెన్ రవీంద్రను నియమించింది. 1999 బ్యాచ్కు చెందిన స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం వెస్ట్ జోన్ ఐజీపీగా ఉన్నారు.