స్థానికులకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని రాయదుర్గంలో కోటెలిజెంట్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కోటెలిజెంట్ ఒప్పందం కుదుర్చుకున్నది. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఈ ఒప్పందంతో వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అండగా ఉండాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నదని చెప్పారు. ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగాలు స్వల్పంగానే ఉంటాయని, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండదని చెప్పారు. కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పించాలని సూచించారు.