Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

ఉమ్మడి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో కవితకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. మంగళవారం ఆమె నామినేషన్‌ దాఖలు చేయగా.. ఒక్కరోజు గ్యాప్‌లోనే ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవమైనట్లు ప్రకటన వచ్చేసింది.ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత మరోసారి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఏడాది క్రితం ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా అఖండ విజయం సాధించిన కవిత మరోసారి తిరిగి పోటీ చేశారు. కవిత తరఫున నాలుగు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. గత ఉప ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండిపోయాయి. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌ నామినేషన్‌ దాఖలు చేసినప్పటికీ అది తిరస్కరణకు గురైంది..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img