Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుకలపై ప్రగతి భవన్‌లో కే కేశవరావు కమిటీతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. వజ్రోత్సవ వేడుకల కార్యాచరణను సీఎం కేసీఆర్‌ ఖరారు చేయనున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 2 వారాలపాటు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ప్రతిపాదనలను కేశవరావు కమిటీ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కమిటీ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కార్యాచరణను ఖరారు చేస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img