బ్రిటన్ నుంచి ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఓ మహిళకు ఒమిక్రాన్ నెగెటివ్గా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. యూకే నుంచి వచ్చిన మహిళ(35) స్వస్థలం రంగారెడ్డి జిల్లా. ఆమె కరోనా నిర్ధారణ కావడంతో టిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా మరో 12 మంది బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల జీనోమ్ రిపోర్టు రావాల్సి ఉందని అధికారులు చెప్పారు.
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో రాష్ట్ర వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు. మాస్కు ధరించని యెడల రూ. 1000 జరిమానా విధిస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే కరోనా మన దరి చేరదు అని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు.