Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

హుజూరాబాద్‌కు ‘దళితబంధు’ కోసం మరో 500 కోట్లు విడుదల

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలుచేస్తున్నది. ఇందులో భాగంగా నియోజకవర్గంలో దళితబంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది.ఈమేరకు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌కు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పైలట్‌ ప్రాజెక్టు అమలుకోసం మొత్తం రూ.2 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని హుజూరాబాద్‌ సభ అనంతరం సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.మొదటి విడతలో భాగంగా ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పైలట్‌ ప్రాజెక్టుకుగాను మొత్తం రూ.వెయ్యి కోట్ల నిధులు విడుదలయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img