రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు
కరీంనగర్ జిల్లా హూజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం బుధవారం వడ్డీ లేని రుణాలు అందించింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు మాట్లాడారు. హుజూరాబాద్లోని అన్ని గ్రామాల్లో మహిళా భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ భవనాల కోసం రూ.4 కోట్లు కేటాయించినట్లు వెల్లడిరచారు. హుజూరాబాద్లో 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించే బాధ్యత తనదన్నారు. సీఎం కేసీఆర్ మాట తప్పని నాయకుడని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.