హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడిరది. నగరంలోని సికింద్రాబాద్, మారేడుపల్లి , బేగంపేట్ , రాణిగంజ్, ప్యారడైస్, చిలుకలగూడ, పరిసర ప్రాంతాల్లో వర్షం పడిరది. అలాగే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాలలోనూ వర్షం పడిరది. నగరంలో మధ్యాహ్నం తర్వాత వాతావరణం కొంత మేరకు చల్లబడిరది. ఎండల తీవ్రతతో సతమతమవుతున్న వారికి కాస్తంత ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడిరచింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వానలు పడుతాయని, ఉత్తర తెలంగాణలో నాలుగు రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నది.