హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. గోల్కొండ, మల్లేపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, మెహిదీపట్నం, కార్వాన్, లంగర్హౌస్, చార్మినార్, అత్తాపూర్, బండ్లగూడలో మోస్తరు వర్షం పడుతున్నది. హుస్సేన్సాగర్ పరిసరాల్లోనూ వర్షం కురుస్తున్నది.పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలువడంతో వాహనాలు స్తంభించాయి. వర్షాల కారణంగా పలుప్రాంతాల్లో గణనాథులు మండపాలకే పరిమితమయ్యాయి. పలు మండపాల నిర్వాహకులు వర్షంలోనే గణేషుడి శోభయాత్ర నిర్వహిస్తున్నారు.