Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

హైదరాబాద్‌లో లక్ష మందికి సీపీఆర్‌ శిక్షణ : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ మహా నగరంలో లక్ష మందికి సీపీఆర్‌ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. జిల్లాల్లో వందల మందికి ఈ శిక్షణ ఇవ్వాలన్నారు. మేడ్చల్‌ జిల్లాలో సీపీఆర్‌ శిక్షణను ప్రారంభించిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు.ఇటీవల కాలంలో నాన్‌ కమ్యూనికేబుల్‌ రోగాలు అధికంగా వస్తున్నాయని కేటీఆర్‌ తెలిపారు. దాంట్లో అతి ముఖ్యమైనది సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ సోషల్‌ మీడియాలో ఒక ఆశ్చర్యకరమైన వీడియోను చూశాను. మొన్న ఓ పిల్లోడు డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు. జిమ్‌లో వర్కవుట్‌ చేస్తూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని కేటీఆర్‌ తెలిపారు. ఆ ప్రదేశాల్లో సీపీఆర్‌ శిక్షణ పొందిన వారు ఉంటే వారి ప్రాణాలను కాపాడేవారని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, మాల్స్‌, బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో సీపీఆర్‌ శిక్షణ పొందిన వారిని నియమించాలన్నారు. లైఫ్‌ స్టైల్‌ ఛేంజెస్‌ వల్ల ఈ రోగాలు చుట్టుముడుతున్నాయి. సీపీఆర్‌ను నేర్పించగలిగితే చాలా వరకు సడెన్‌ కార్డియాక్‌ అరెస్టును తగ్గించొచ్చు. రక్త ప్రసరణ ఆగిపోకుండా ప్రాథమికంగా ఆ వ్యక్తిని కాపాడుకోవచ్చు అని కేటీఆర్‌ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img