Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

హైదరాబాద్‌ మహానగరం మరిన్ని కిలోమీటర్లు విస్తరిస్తోంది : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరం రోజురోజుకూ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వచ్చే 30 ఏళ్లలో మరిన్ని కిలోమీటర్లు విస్తరిస్తోందని అన్నారు. మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలో రూ. 138 కోట్ల వ్యయంతో చేపట్టిన బాచూపల్లి రోడ్డు విస్తరణలో భాగంగా బాచూపల్లి నుంచి ఓఆర్‌ఆర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బౌరంపేటలో ఆక్సిజన్‌ పార్క్‌ ప్రారంభించారు. 2051అవసరాలను దృష్టిలో పెట్టుకుని శివారు మున్సిపాల్టీల్లో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, నిజాంపేట మేయర్‌ కొలన్‌ నీలా గోపాల్‌ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్‌, ఎమ్మెల్సీలు శంభి పూర్‌ రాజు, సురభి వాణి దేవి, స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img