Friday, April 19, 2024
Friday, April 19, 2024

లింగ నిర్ధార‌ణ ద్వారా గ‌ర్భ‌స్రావాలు చేస్తున్న 18 మంది అరెస్టు

  • లింగ నిర్ధార‌ణ ద్వారా గ‌ర్భ‌స్రావాలు చేస్తున్న 18 మందిని అరెస్టు చేసిన‌ట్లు సీపీ రంగ‌నాథ్ పేర్కొన్నారు. వీరి నుంచి 18 సెల్‌ఫోన్లు, రూ.73 వేలు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూౌ వ‌రంగ‌ల్‌లోని ప‌లు ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల్లో య‌థేచ్చ‌గా లింగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు కొన‌సాగుతున్నాయని, ఆయా ఆస్ప‌త్రుల‌పై పోలీసుల‌కు ప‌లు ఫిర్యాదులు వ‌చ్చాయన్నారు. లింగ నిర్ధార‌ణ ద్వారా గ‌ర్భ‌స్రావాలు చేస్తున్న లోట‌స్ ఆస్ప‌త్రి య‌జ‌మాని, వైద్యుల‌ను అరెస్టు చేశామ‌ని సీపీ పేర్కొన్నారు. న‌ర్సంపేట కేంద్రంగా పెద్ద ఎత్తున దందా జ‌ర‌గుతోంద‌న్నారు. ఆయుర్వేద వైద్యులు కూడా గ‌ర్భ‌స్రావాలు చేస్తున్నార‌ని తెలిపారు. ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న వైద్యులు, సిబ్బంది అంద‌రినీ ప‌ట్టుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. గ‌ర్భ‌స్రావాల కోసం ఒక్కొక్క‌రి నుంచి రూ. 30 వేలు వ‌సూలు చేస్తున్న‌ట్లు త‌మ ప‌రిశీలన‌లో తేలింద‌ని సీపీ పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే వైద్య శాఖ అధికారుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి త‌గు చ‌ర్య‌లు తీసుకుంటామని సీపీ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img