దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని టీఎస్ఆర్టీసీ ఈ నెల 24 నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. వచ్చే నెల(అక్టోబరు) నాలుగో తేదీ వరకు ఈ సర్వీసులు నడవనున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం ఆదివారం వెల్లడిరచిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 24, 25 తేదీలతో పాటు 30 వ తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఈ సర్వీసులు నడవనున్నాయి. తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు నడపనున్న ఈ సర్వీసులకు సంబంధించి అధికారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తంమీద 498 అదనపు బస్సు సర్వీసులను ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. వివరాలిలా ఉన్నాయి.