Friday, April 19, 2024
Friday, April 19, 2024

25న గులాబీ జెండా సంబురం.. 27న బీఆర్ఎస్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం

ఈనెల 25వ‌తేదీన గులాబీ జెండా సంబురం చేసుకుంటున్నామ‌ని, అలాగే 27వ తేదీన బీఆర్ఎస్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూౌ బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం సందర్భంగా ఈనెల 25న నియోజకవర్గ స్థాయి సమావేశాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ప్రతి గ్రామంలో, మున్సిపల్‌ వార్డులో ప్రతి డివిజన్‌లో పార్టీ జెండా ఎగురవేసి.. సమావేశం నిర్వహించే బాధ్యత నియోజకవర్గ ఇన్‌ఛార్జిలదేన‌ని మంత్రి కేటీఆర్‌ మరోసారి సూచించారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభల స్థాయిలో జరుగుతున్నాయని, వాటిని కూడా మే నెలాఖరు వరకు పొడిగించామ‌న్నారు. పార్టీ అన్నిరకాలుగా ఎన్నికలతో పాటు అన్ని పోరాటాలకు సన్నద్దంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు కార్యకర్తలతో సంభాషణ జరగాలని ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశామ‌న్నారు. ఇవి చక్కగా జరుగుతున్నాయని, అక్కడక్కడ త‌మ దృష్టికి వచ్చిన చిన్న ఇబ్బందులను కరెక్ట్‌ చేసుకుని ముందుకెళ్తామ‌ని కేటీఆర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img