హైదరాబాద్లో ప్రధాన రవాణా సౌకర్యాల్లో ఒకటైన ఎంఎంటీఎస్ సర్వీసులు సోమవారం సగమే నడవనున్నాయి. 36 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడిరచింది. ప్రస్తుతం ఈ పరిధిలో ట్రాక్ మరమ్మత్తులు, సాంకేతిక కారణాలతో సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.ప్రస్తుతం 79 సర్వీసులకు గాను 36 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. వివరాలు ఇలా వున్నాయి. లింగంపల్లి-నాంపల్లి రూట్లో9 సర్వీసులు, నాంపల్లి-లింగంపల్లి వైపు9, ఫలక్నుమా-లింగంపల్లిలో 8, లింగంపల్లి-ఫలక్నుమా వైపు 8, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్లో 1 సర్వీసును రద్దు చేసినట్లుగా వెల్లడిరచింది.