రాగల 48 గంటల్లో హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని.. రాష్ట్రంలోని పలు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ంండు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి.. తీరం దాటింది. దీని ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని తెలిపింది. ఈ ప్రభావంతోనే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా ఖమ్మం, నారాయణపేట, నగర్ కర్నూలు, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.హైదరాబాద్ లో తెల్లవారు జామునుంచి చినుకులు పడ్డాయి.