ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని 66 దళిత కుటుంబాల ఖాతాల్లో రూ. 6.6 కోట్ల నగదు జమ అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం నుంచి వారి సెల్ఫోన్లకు బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్లు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పౌల్ట్రీ, డెయిరీ ఫామ్ తదితర యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారు. ఆయా యూనిట్లపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు అధికారులు గురువారం వారిని బస్సులో క్షేత్ర స్థాయి పర్యటనకు తీసుకెళ్లారు.