Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

తుమ్మలూరులో తొమ్మిదో విడత హరితహారం ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణకు హరితహారంతొమ్మిదో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లోభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు హరితోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్‌ ఫారెస్ట్‌బతీపaఅ టశీతీవర్‌) పార్కులో మొక్కను నాటి తొమ్మిదో విడత హరితహారానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, రాచకొండ సీపీ చౌహాన్‌, ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
అంతకుముందు సఫారీ వాహనంలో పార్కులో కలియతిరిగిన సీఎం కేసీఆర్‌.. ఫొటో ఎగ్జిబిషన్‌ను, అటవీ అధికారుల సామాగ్రిని తిలకించారు. అనంతరం బీటీఆర్‌ క్రికెట్‌ స్టేడియంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడనున్నారు. తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 19.29 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.తాను నమ్మిన ప్రకృతి పునరుజ్జీవనాన్ని తెలంగాణ సమాజంలోని ప్రతి ఒక్కరి మదికి ఎకేలా చేయటంలో సీఎం కేసీఆర్‌ సక్సెస్‌ అయ్యారు. ఆయన కృషి, పట్టుదల ఫలితాలే దశాబ్ది తెలంగాణలో మన కండ్ల ముందు కనిపిస్తున్న సతతం హరితం.. తెలంగాణం. ఎమిదేండ్లలో నాటిన 273.33 కోట్ల మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్‌తోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచింది. ఇందుకు ప్రభుత్వం రూ.10,822 కోట్లు ఖర్చుచేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img