Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

100 ఎకరాల్లో పొంగులేటి చేరిక సభ..

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జులై 2న కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పొంగులేటి, జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ సభలో హస్తం గూటికి చేరనున్నారు.ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా రానుండగా.. ఈ సందర్భంగా లక్షలాది మంది ప్రజల సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేతలతో పాటు రాష్ట్ర ముఖ్యనేతలందరూ హాజరుకానున్నారు. ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎస్ఆర్ గార్డెన్స్ పక్కన ఉన్న వంద ఎకరాల స్థలంలో సభకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ సభకు జనగర్జనగా నామకరణం చేశారు. 5 లక్షలకుపైగా ప్రజలను ఈ సభకు తరలించేందుకు పొంగులేటితో పాటు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. చాలాకాలం తర్వాత తెలంగాణలో రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొననుండటం, ఎన్నికలు సమీపిస్తుండటంతో.. దీనిని గ్రాండ్ సక్సెస్ చేయాలని భావిస్తున్నారు.ఈ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు రేపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు రానున్నారు.ఈ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు నేడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే భేటీ కానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img