Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది రైలును నాగ్‌పూర్‌ సమీపంలో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగి పరుగులుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ హాని జరగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img