Friday, April 19, 2024
Friday, April 19, 2024

అందులో.. జగన్‌, విజయసాయిలను మించినవారు లేరు : పట్టాభి

సీఎం జగన్‌, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలు గుప్పించారు. సూట్‌ కేస్‌ కంపెనీలను ఏర్పాటు చేయడంలో వీరిద్దరికీ మించిన వాళ్లు ఎవరూ లేరని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బ్యాంకుల నుంచి నిధులు కొల్లగొట్టేందుకు సూట్‌ కేస్‌ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఏపీఎస్డీసీ పేరుతో కంపెనీని ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రూ. 25 వేల కోట్ల రుణాలను కొల్లగొట్టారని ఆరోపించారు. కార్పొరేషన్ల పేరుతో డబ్బులు తెచ్చి, వాటిని దారి మళ్లించి, అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కార్పొరేషన్ల పేరుతో ఏపీ చేస్తున్న అప్పులపై రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా ఆందోళన వ్యక్తం చేసిందని అన్నారు. అవినీతికి పాల్పడుతున్నారని తాము ముందు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నామని… తమ మాదిరే ఇప్పుడు ఆర్బీఐ కూడా ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img