- కలెక్టర్ కు ఎంపీపీ , సర్పంచుల ఫిర్యాదు
- అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
విశాలాంధ్ర – నాగులప్పలపాడు:- మండలంలో కొత్త పింఛన్ల పంపిణీకి స్థానిక ప్రజాప్రతినిధులను పిలవ వద్దని ఎంపీడీవో నుంచి కార్యదర్శులకు సందేశాలు వెళ్లడం తీవ్ర వివాదస్పదమైంది . ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను పిలవవద్దని ఎంపీడీవో ఆదేశించడంపై ఎంపీపీ నలమలపు అంజమ్మ , పలువురు సర్పంచులు సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు . ఆయన సొంత ఎజెండాతో ముందుకుపోతున్నారన్నారు . ప్రజాప్రతినిధులతో మాట్లాడే సమయంలో కూడా అహంకార పూర్వకంగా వ్యవహిరిస్తున్నారన్నారు . ఇక జిల్లాలో పెద్ద మండలంగా ఉన్నప్పటికీ , కీలకమైన అధికారులు స్థానాలు ఇన్చార్జ్ పాలనలో ఉన్నాయన్నారు . పూర్తిస్థాయి అధికారులను మండలానికి కేటాయించాలని కోరారు . అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదస్పద ఎంపీడీవో శ్రీనివాసరావును రాజకీయ దురుద్దేశంతోనే తమ మండలానికి ఇన్చార్జ్ నియమించారన్నారు . ఆమె వెంట వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నలమలుపు కృష్ణారెడ్డి ,పొలినేని కోటేశ్వరరావు, సర్పంచు ఘటమనేని అశోక్ , ఎంపీటీసీ అనురాధ, బోలె అంజనేయులు, బక్కా అనంద్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.