Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

కృష్ణానదిలో తెప్పోత్సవానికి బ్రేక్‌- దుర్గాఘాట్‌లోనే పూజలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి సంబరాలు చివరి దశకు చేరుకుంటున్నాయి. శరన్నవరాత్రుల నేపథ్యంలో కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ కృష్ణానదిలో ప్రతికూల పరిస్ధితుల కారణంగా దీన్ని రద్దు చేశారు. కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారానికి బ్రేక్‌ పడిరది. కృష్ణానదిలో భారీ వరద ప్రవాహం కారణంగా ఈ ఏడాది తెప్పోత్సవం నిర్వహించరాదని అధికారులు నిర్ణయించారు. దానికి బదులుగా నది ఒడ్డున హంస వాహనం ఉంచి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు రావడంతోనే నదీ విహారం కు సాధ్యపడదని జల వనరుల శాఖ కలెక్టర్‌ కు రిపోర్ట్‌ అందింది. దీంతో తెప్పోత్సవానికి అనుమతివ్వడం లేదని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img