Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఖమ్మంలో ఆటో నడిపిన వైఎస్‌ షర్మిల

వైఎస్సార్‌టీపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం 96వ రోజుకు చేరుకుంది. ఖమ్మం నియోజక వర్గం దంసలాపురం క్యాంప్‌ నుంచి ఆమె ఇవ్వాళ పాదయాత్ర ప్రారంభించారు. ఖమ్మం టౌన్‌ పరిధిలోని కొత్తూరు, ముస్తఫానగర్‌, శాంతి నగర్‌, తుమ్మలగడ్డ, జెడ్పీ సెంటర్‌, పాత బస్టాండ్‌ సర్కిల్‌, చర్చి కాంపౌండ్‌ సెంటర్‌ మీదుగా పాదయాత్ర సాగనుంది. ఈ క్రమంలోనే ఖమ్మం టౌన్‌ ముస్తఫానగర్‌కు వైఎస్‌ షర్మిల చేరుకోగా..అక్కడ ఓ అభిమాని కోరిక మేరకు ఆటో నడిపారు. సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్‌ సర్కిల్‌ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img