Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

జగన్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఏపీలో నిధుల దారిమళ్లింపుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా జగన్‌ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. స్టేట్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ నిధులను పీడీ ఖాతాలకు మళ్లింపుపై బుధవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. నిధుల దారి మళ్లింపుపై కేంద్ర ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఎస్డీఆర్‌ఎఫ్‌ (%ూణRఖీ%) నిధుల దారి మళ్లింపును నిలుపుదల చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.
గతంలో ఇదే కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా కొవిడ్‌ బాధితులకు నష్టపరిహారంపై ఇప్పటికే… ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముగ్గురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img