Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మరో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

. ఈసారి శాసనసభ్యుల కోటాలో
. 13లోగా నామినేషన్ల దాఖలు
. 23న అసెంబ్లీ భవనంలో పోలింగ్‌
. నోటిఫికేషన్‌ జారీ చేసిన ఈఆర్‌వో సుబ్బారెడ్డి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో ఈనెలాఖరుకు శాసనసభ్యుల కోటా కింద ఖాళీ అవుతున్న 7 ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికకు సంబంధించి సోమవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి, ఎన్ని కల రిటర్నింగ్‌ అధికారి పి.వి. సుబ్బారెడ్డి ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. శాసన మండలి సభ్యులు చల్లా భగీరథ్‌ రెడ్డి పదవీ కాలం గత నవంబరు 2వ తేదీతో పూర్తి కాగా, ప్రస్తుత సభ్యులు నారా లోకేశ్‌, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద రావు, వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స, గంగుల ప్రభాకర్‌ రెడ్డి పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. ఈ ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 27వతేదీన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగా సోమవారం ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రకటనను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సుబ్బారెడ్డి జారీ చేశారు. నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థులు స్వయంగా గాని లేదా వారి ప్రతిపాదకుడు గాని వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభా భవనంలో రిటర్నింగ్‌ అధికారైన తన వద్దగాని లేదా సహాయ రిటర్నింగ్‌ అధికారి, శాసన మండలి ఉపకార్యదర్శికి గాని వారి నామినేషన్లను సమర్పించవచ్చని సుబ్బారెడ్డి తెలిపారు.ఈనెల 6వతేదీ నుండి 13వ తేదీ వరకూ సెలవు దినాలు మినహా మిగతా పనిదినాల్లో ఉదయం 11గం.ల నుండి మధ్యాహ్నాం 3గం.ల వరకూ నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. నామినేషన్‌ పత్రాలను పైన పేర్కొన్న స్థలం, సమయాల్లో పొందవచ్చని వివరించారు. ఈనెల 14వతేదీన ఉదయం 11గం.లకు అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 16వతేదీ మధ్యాహ్నం 3గం.ల వరకూ నామినేష్ల ఉసంహరణకు గడువు ఉంటుంది. ఆ గడువులోగా ఎవరైనా అభ్యర్థులు వారి నామినేష్లనను ఉపసంహ రించు కోవాలనుకుంటే అభ్యర్థిత్వ ఉపసంహరణ నోటీసును అభ్యర్థి లేదా వారి ప్రతిపాదకుడు లేదా రాత పూర్వకంగా అందించేందుకు అధికారం పొందిన వారి ఎన్నికల ఏజెంటు గానీ రిటర్నింగ్‌ అధికారి లేదా సహాయ రిటర్నింగ్‌ అధికారికి గాని అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోటీ ఉన్నచో ఈనెల 23వ తేదీ ఉదయం 9గం.ల నుండి సాయంత్రం 4గం.ల వరకూ అసెంబ్లీ భవనంలో పోలింగ్‌ జరుగుతుందని, సా.5గం.లకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని రిటర్నింగ్‌ అధికారి సుబ్బారెడ్డి వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img