తెలంగాణ రాష్ట్ర సీఎస్ పై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దిల్లీ కన్నా దగ్గరలోనే రాజ్ భవన్ ఉంది. సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు రాజ్ భవన్ను సందర్శించలేదన్నారు. రాజ్ భవన్ను సందర్శించడానికి సమయం లేదా అని, ప్రోటోకాల్ లేదు.. పిలిచినా కూడా మర్యాద లేదని తమిళిసై సౌందర రాజన్ అన్నారు. కనీస మర్యాదగా ఫోన్ లో కూడా మాట్లాడలేదన్నారు. తెలంగాణ సీఎస్ పై గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు.