Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

రుణాలు సద్వినియోగం చేసుకోండి

ఎల్‌ డిఎం నాగరాజు రెడ్డి
విశాలాంధ్ర`ఉరవకొండ :
స్టాండప్‌ ఇండియా పథకంలో భాగంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రుణాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ నాగరాజు రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం లో రుణాల మంజూరు కోసం అవగాహన సదస్సును నిర్వహించారు. సమావేశం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ స్టాండ్‌ ఆఫ్‌ ఇండియా పథకంలో భాగంగా పారిశ్రామిక వేతలకు వివిధ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు ప్రధానంగా నూతన స్వయం ఉపాధి పథకాలకు, సూక్ష్మ తరహా పరిశ్రమలు,చేనేత కార్మికులకు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే వాటికి సంబంధించి రుణాలను మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు అందులో భాగంగా ఈనెల 21న అనంతపురంలో రుణమేల కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని అర్హులైన వారందరూ కూడా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.స్టాండప్‌ ఇండియా పథకంలో భాగంగా ఏ ఏ వాటికి రుణ సదుపాయం అవకాశాలు ఉన్నాయో స్వయం సహాయక సంఘాలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారి రాజశేఖర్‌ రెడ్డి, నాగరాజు రావు, హ్యాండ్లూమ్‌ ఏడి బసవరాజు, ఎంపీపీ చంద్రమ్మ, వైస్‌ ఎంపీపీ నరసింహులు, వీరితోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేతలు, స్వయం సహాయక సంఘాల లీడర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img