Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రూ,1.52 లక్షల విలువ గల వస్తువులు బహుకరణ

విశాలాంధ్ర :ఉరవకొండ;ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన శ్రీమతి కె. విజయలక్ష్మి , శ్రీధర్ రావు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ వారు నరసింహ స్వామి వారికి రూ.1.52 లక్షల రూపాయలు విలువ గల వస్తువులను బహుకరించినట్లు ఆలయ ఈవో కె విజయ్ కుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 కేజీలు 627 గ్రాముల 0.58 మి. గ్రా వెండి వస్తువులు (17 బాగాలు) కిరీటములు -3, వక్షస్థలాలు -3, హస్తాలు -6, శంకు చక్రాలు -2, పాదస్థిరాలు -3, ఉత్సవ విగ్రహముల అలంకరణ నిమిత్తం బహుకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శ్రీ ఏ ఎన్ ద్వారకనాథ చార్యులు, శ్రీ ఎం బాలాజీ పాల్గొన్నారు.

Type / to choose a block

Post Settings

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img