విశాలాంధ్ర,కదిరి : శ్రీ చైతన్య స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేయాలని ఆర్టిఓ హరి ప్రసాద్ కు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబ్జన్ వినతి పత్రాన్ని సమర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం బస్సులో విద్యార్థులను సిట్టింగ్ పర్మిషన్ కన్నా ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించి నడుపుతున్నారని, రవాణా పేరుతో విద్యార్థుల నుంచి ఫీజుగా 8వేల నుండి 14వేల రూపాయలు వసూలు చేసి విద్యార్థులను సంతల్లో పశువుల్లాగా బస్సుల్లో రవాణా చేస్తూ విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బస్సులలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండదని, స్పీడోమీటర్ ఉండదని, ఇష్టానుసారంగా బస్సులు ఓవర్ లోడ్ వేసుకొని ఓవర్ స్పీడ్ గా కూడా వెళ్తుంటారని చైతన్య బస్సులను వెంటనే సీజ్ చేసి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మహేష్, రాజు, యశ్వంత్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.